ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాహనాలకు మీడియా స్టిక్కర్లు...గుట్టుగా గుట్కా తరలింపు - nandyal gutka traders caught latest news

కర్నూలు జిల్లా నంద్యాలలో గుట్కా ప్యాకెట్లను యథేచ్ఛగా తరలిస్తున్నారు. గుట్కా రవాణా కోసం వాహనాలకు మీడియా స్టిక్కర్లు అతికించారు. అనుమానంతో వెంకటేశ్వరపురం వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో గుట్కా గుట్టు బయటపడింది. పట్టణంలో మరో చోట రూ. 11 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న ముఠాను అరెస్ట్​ చేసినట్లు డీఎస్పీ తెలియజేశారు.

gutka sellers kept media sticker to their vehicles and trading their business caught by nandyal police
భారీగా గుట్కా పట్టుకున్న నంద్యాల పోలీసులు

By

Published : Jun 4, 2020, 10:21 PM IST

వాహనాలపై మీడియా స్టిక్కర్లు అంటించి కర్నూలు జిల్లా నంద్యాలలో గుట్టుగా గుట్కా తరలిస్తున్న వ్యాపారస్థులను పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 1వ తేదీన వెంకటేశ్వరపురం వద్ద వాహనాల తనిఖీల్లో ఓ దినపత్రికను తరలించే వాహనంలో రూ.5700 విలువైన 570 గుట్కా ప్యాకెట్లు గుర్తించారు. వాటికి సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులకు భారీగా గుట్కా దొరికింది.

కర్నూలుకు చెందిన కోట్ర సుబ్బయ్య అనే వ్యక్తి తన వాహనానికి ప్రెస్ స్టిక్కర్​ను అతికించి విలేకరిగా చలామణి అవుతూ గుట్కా రవాణా చేస్తున్నాడు. కర్ణాటక రాయచూరు ప్రాంతంలో గుట్కా కొనుగోలు చేసి కర్నూలుకు చెందిన వారికి అమ్ముతున్నాడని నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి తెలిపారు.

నంద్యాలలో మరో చోట గుట్కాను తరలిస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.11 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు, రూ.8.88 లక్షల నగదు, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, క్యాష్ మెషిన్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 9 మంది పట్టుబడగా... ఓ వ్యక్తి పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి : రూ.15 లక్షల విలువైన గుట్కా పట్టివేత

ABOUT THE AUTHOR

...view details