ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గౌరు దారి ఎటో? - గౌరు చరితారెడ్డి

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం...వైకాపాలో చిచ్చుపెడుతోంది. రెండు బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు వైకాపా నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండటంతో...టికెట్ ఎవరిని వరిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డికి టికెట్ ఖరారైనట్లు, గౌరు దంపతులు వైకాపాకు గుడ్​బై చెప్పనున్నట్లు ప్రచారం సాగుతోంది.

కార్యకర్తలతో గౌరు చరితారెడ్డి సమావేశం

By

Published : Feb 27, 2019, 5:04 AM IST

కార్యకర్తలతో గౌరు చరితారెడ్డి సమావేశం

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. టికెట్​పై వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్​రెడ్డి నుంచి స్పష్టత లేకపోవడంతో కర్నూలులోని ఆమె ఇంట్లో కార్యకర్తలతో చర్చిస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు గౌరు దంపతులను కలుస్తున్నారు.
పాణ్యం టికెట్​ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​రెడ్డికి దాదాపు ఖరారైనట్లు...గౌరు దంపతులు వైకాపాకు గుడ్​బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది.. రెండురోజుల్లో గౌరు వెంకటరెడ్డి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారని కార్యకర్తలు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details