ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోసం చేశాడని ప్రియుడు ఇంటి ముందు యువతి ధర్నా - నందవరంలో యువతి ధర్నా వార్తలు

ఫేస్​బుక్ ద్వారా మొదలైన ప్రేమ..పెళ్లికి దారితీసింది. ఇప్పుడు ఆ వివాహం కాస్తా మున్నాళ్ల ముచ్చటే అయ్యింది. ప్రియుడు మోసం చేశాడంటూ..ఓ యువతి అతని ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఈ ఘటన కర్నూలు జిల్లా నందవరంలో జరిగింది.

girl friend protest at front of boyfriend's house at nandavaram
నందవరంలో యువతి ధర్నా

By

Published : Aug 7, 2020, 3:52 PM IST

ప్రియుడు మోసం చేశాడంటూ. ఓ యువతి అతని ఇంటిముందు ఆందోళన చేసింది. కర్నూలు జిల్లా నందవరానికి చెందిన డిగ్రీ విద్యార్థి రాకేష్​కు హైదరాబాద్​కు చెందిన అనూష ఫేస్​బుక్ ద్వారా పరిచయం అయ్యింది. మూడు నెలలు పరిచయం ప్రేమగా మారి హైదరాబాద్​లోని ఓ దేవాలయంలో జూలై 4న ఇద్దరూపెళ్లి చేసుకున్నారు. నాలుగు రోజులు గడిచాక రాకేష్ నందవరానికి వెళ్లాడు. ప్రియుడు హైదరాబాద్ నుంచి తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన అనూష... నందవరంలోని రాకేష్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. మహిళా సంఘాలు ఆమెకు మద్దతుగా నిలిచాయి. విషయం తెలుసుకున్న నందవరం పోలీసులు విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details