ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Arrest: ఒంటరి వ్యక్తులే లక్ష్యంగా దారి దోపిడి.. ముగ్గురు అరెస్టు - దొంగల అరెస్టు తాజా వార్త

వారంతా దినసరి కూలీలు. ఇళ్లల్లో గ్రానైట్ రాయి అలంకరణ చేసే పనితో కుటుంబాలను పోషించుకునే వారు. మద్యానికి బానిసైన వారికి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే దురాశ పుట్టింది. ముఠాగా ఏర్పడి ఒంటరి వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని కత్తులు చూపించి డబ్బు దోచుకోవటం పనిగా పట్టుకున్నారు. పోలీసులకు పట్టుబడి కటకటాలు లెక్కిస్తున్నారు.

Gang of thieves arrested at kurnool
ఒంటరి వ్యక్తులే లక్ష్యంగా దారి దోపిడి

By

Published : Jun 15, 2021, 7:56 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో దొంగతనాలు, దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుడిపాటి గడ్డకు చెందిన అక్బర్, ముల్లాన్ పేటకు చెందిన రహంతుల్లా, నడిగడ్డకు చెందిన మున్నాలు ఇళ్లలో గ్రానైట్ రాయి అలంకరణ చేసే పనితో కుటుంబాలను పోషించుకునే వారు. మద్యానికి బానిసైన వీరు..అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే దురాలోచనతో ముఠాగా ఏర్పడ్డారు. ఒంటరి వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని గత కొంత కాలంగా దోపిడీలకు పాల్పడుతున్నారు.

గత నెల నంద్యాల సమీపంలోని ఆటో నగర్, రైతునగర్ వద్ద ఓ లారీ డ్రైవర్​ను, బొలెరో వాహన డ్రైవర్​ను కత్తులతో బెదిరించి వారి వద్ద నుంచి రెండు చరవాణులు, రూ.4,500 నగదును దోచుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇవాళ నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు కత్తులు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితుల్లో ఒకడైన అక్బర్ గంతలోనే ఓ హత్య కేసు, దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నట్లు వెల్లడంచారు.

ABOUT THE AUTHOR

...view details