దారి దోపిడీకి పాల్పడుతున్న ఆరుగురు ముఠా సభ్యులను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో పలుచోట్ల దారి దోపిడీకి పాల్పడుతున్న సంపత్రెడ్డి, షేక్ మహమ్మద్ అఫ్రోజ్, రంజిత్, సాయితేజ, దిలీప్కుమార్, లోకేశ్ అనే యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి కారు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు రూ.25 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకట్రామయ్య తెలిపారు. ఈ ముఠాలో ఇద్దరు వ్యక్తులు తప్పించుకున్నారనీ.. వారిని త్వరలో పట్టుకుంటామని ఆయన తెలిపారు.
దారి దోపిడీకి పాల్పడుతున్న ముఠా అరెస్ట్ - కర్నూలు జిల్లా క్రైమ్ వార్తలు
దారి దోపిడీకి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రెండు ద్విచక్రవాహనాలు..రూ.25 వేలను స్వాధీనం చేసుకున్నారు.

Gang arrested