ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'విగ్రహాల మీద ఉన్న దృష్టి.. తాగునీటి సరఫరా మీద లేదు'

By

Published : Feb 16, 2022, 2:43 PM IST

కృష్ణా జిల్లా నందిగామలో అధికారులకు, నాయకులకు విగ్రహాల మీద ఉన్న దృష్టి.. తాగునీటి సరఫరా0 మీద లేదని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కేవలం విగ్రహాల పేరుతో రాజకీయాలు చేస్తూ... రక్షిత మంచినీటి సరఫరా, ఇతర అభివృద్ధి పనులను గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రభుత్వ అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ.. వ్యవస్థలన్నీ నాశనం చేస్తున్నారని ఆరోపించారు.

తంగిరాల సౌమ్య
తంగిరాల సౌమ్య

కృష్ణా జిల్లా నందిగామలో ఎటువంటి అనుమతులూ లేకుండా జాతీయ, రాష్ట్ర, మహానుభావుల విగ్రహాలను తొలగించి.. ప్రభుత్వ వైద్యశాల వెనక ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్మాణ పనులు చేపట్టడంపై మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు తీసుకోకుండానే ప్రభుత్వ వైద్యశాల ప్రహరీ గోడను కూల్చివేశారని.. అందులో ఉన్న దశాబ్దాల నాటి చెట్లను సైతం నరికి వేశారని మండిపడ్డారు. అనుమతులు ఉన్నాయా అని నందిగామ మున్సిపల్ కమిషనర్ జయరాములను తంగిరాలసౌమ్య నిలదీశారు. కమిషనర్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నందిగామ నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగా చందర్లపాడు రోడ్డులోని రక్షిత మంచి నీటి పైప్ లైన్ లీకేజీలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. నందిగామలో వైకాపా ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి ఇదేనా? అని ప్రశ్నించారు.

స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కేవలం విగ్రహాల పేరుతో రాజకీయాలు చేస్తూ...రక్షిత మంచినీటి సరఫరా తదితర అభివృద్ధి పనులను గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రభుత్వ అధికారులు మాత్రం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ.. వ్యవస్థలన్నీ నాశనం చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి :DEMOLISH: ఆళ్లగడ్డలో బస్‌షెల్టర్‌ కూల్చివేత వివాదం..విఖ్యాత రెడ్డి నిరసన

ABOUT THE AUTHOR

...view details