ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 31, 2021, 12:38 AM IST

Updated : Mar 31, 2021, 1:21 AM IST

ETV Bharat / state

నంద్యాల చెక్‌పోస్ట్‌ వద్ద భారీ అగ్నిప్రమాదం

కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నంద్యాల చెక్ పోస్టు వద్ద ఒక హోటల్​ లో గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఘటన జరిగింది. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

fire accident
fire accident

నంద్యాల చెక్‌పోస్ట్‌ వద్ద భారీ అగ్నిప్రమాదం

కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు వద్ద మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. చెక్‌పోస్టు వద్ద ఉన్న ఓ హోటల్‌లో మూడు గ్యాస్‌ సిలిండర్లు పేలాయి. దీంతో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. పేలుడుధాటికి చుట్టుపక్కల్లోని గృహసముదాయాల్లోని ప్రజలు భయాందోళతో పరుగులు పెట్టారు. హోటల్‌ మూడు రోజులుగా మూసి ఉంచడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్‌ ఇంజిన్లతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. హోటల్‌లో 16 సిలిండర్లు ఉండడంతో పోలీసులు యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Last Updated : Mar 31, 2021, 1:21 AM IST

ABOUT THE AUTHOR

...view details