ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Fake cotton Seeds Seized: నకిలీ పత్తి విత్తనాల తయారీ ముఠా అరెస్ట్

తెలుగు రాష్ట్రాలతో సహా కర్ణాటకలోనూ నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తూ.. రైతులను మోసం చేస్తున్న ముఠాను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. 2 కోట్ల రూపాయల విలువైన నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Jun 19, 2021, 7:17 PM IST

Published : Jun 19, 2021, 7:17 PM IST

Fake cotton Seeds Seized in Kurnool
నకిలీ పత్తివిత్తనాల ముఠా గుట్టు రట్టు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. 2 కోట్ల రూపాయల విలువైన నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. పత్తి విత్తనాలతో పాటు.. పురుగు మందులు, గుట్కా, పాన్ మసాలా, టీ, డిటర్జెంట్లు సహా పలు రకాల బ్రాండ్లకు చెందిన నకిలీ ప్యాకింగ్ కవర్లను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. తయారీకి వినియోగిస్తున్న 683 సిలిండర్లు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details