ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 10, 2020, 2:15 PM IST

ETV Bharat / state

'తెదేపా రంజాన్ తోఫా ఇచ్చింది... మరి వైకాపా ఏం ఇస్తుంది?'

రంజాన్ మాసంలో పేద ముస్లింలను ఆదుకునేందుకు తెదేపా హయాంలో రంజాన్ తోఫా ఇచ్చిందని... మరిప్పుడు వైకాపా ప్రభుత్వం ఏం ఇస్తోందని.. మాజీ మంత్రి ఫరూక్ ప్రశ్నించారు. ముస్లింలను ఆదుకోవాలని కోరారు.

ex minister mnd farooq request to government to help poor muslims in this ramjaan month
మాజీ మంత్రి ఫరూక్

రంజాన్ మాసంలో పేద ముస్లింలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్ నాయకుడు ఎన్​.ఎం.డీ. ఫరూక్ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో మాట్లాడుతూ.. తెదేపా హయాంలో రంజాన్ తోఫా పేరుతో నిత్యావసర సరకులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

ఇమామ్​లకు ఇంతవరకు ఎలాంటి డబ్బులు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని.. ఇప్పటికైనా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయాలని సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details