ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు జిల్లాలో శనగల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - markfed

కర్నూలు జిల్లాలో శనగల కొనుగోలు కేంద్రాలను మార్క్​ఫెడ్​ ప్రారంభించింది. ఈ విధానంలో ఒక్కో రైతు నుంచి వంద క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసి, 15రోజుల్లోనే నగదును జమ చేయనున్నారు.

Establishment of Peanut Purchase Centers in Kurnool District
కర్నూలు జిల్లాలో శనగల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

By

Published : Feb 20, 2020, 7:07 PM IST

కర్నూలు జిల్లాలో శనగల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనగల కొనుగోలు కేంద్రాలను మార్క్​ఫెడ్ ప్రారంభించింది. ఈ రబీ సీజన్లో జిల్లాలో రెండు లక్షల పంతొమ్మిది వేల హెక్టార్లలో శనగ పంటను సాగు చేశారు. వాతావరణం అనుకూలించడంతో ఈ సారి దిగుబడి అధికంగా వచ్చింది. ప్రభుత్వం రైతులకు క్వింటాకు 4875 రూపాయల మద్దతు ధర అందిస్తోంది. ఒక్కో రైతు నుంచి గరిష్ఠంగా వంద క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని, సరకు కొనుగోలు చేసిన 15 రోజుల్లోనే రైతు ఖాతాలో నగదు జమ చేస్తామని కర్నూలు జిల్లా మార్క్​ఫెడ్​ ఎండీ సురేష్​కుమార్ అన్నారు 'ఈ క్రాపింగ్' ఉండటంతో కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు ఉండవని ఆయన తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details