కర్నూలు సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆర్టీసీ బస్సులో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 13.3 కేజీల వెండిని గుర్తించారు. నాసిర్ హుస్సేన్ అనే వ్యక్తి నుంచి 78 వెండి బిస్కేట్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. విచారణ నిమిత్తం నిందితుడిని తాలూకా పోలీసులకు అప్పగించారు. ఆ వెండిని హైదరాబాద్ నుంచి నంద్యాలకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
పంచలింగాల చెక్ పోస్టు వద్ద 13.3 కేజీల వెండి పట్టివేత - అక్రమంగా తరలిస్తున్న వెండి పట్టివేత
కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్టు వద్ద ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేపట్టిన వాహన తనిఖీల్లో 13.3 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు.
పంచలింగాల చెక్ పోస్టు