ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద..ప్రకాశం బ్యారేజికీ పెరిగిన ఉద్ధృతి

By

Published : Sep 12, 2019, 10:52 AM IST

Updated : Oct 4, 2019, 12:22 PM IST

ఎగువ ప్రాంతాల్లో వర్షాల వల్ల శ్రీశైలానికి జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రవాహ ఉద్ధృతి పెరిగినందున ప్రకాశం బ్యారేజీల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్​ నీటిమట్టం 884.40 అడుగులకు చేరుకుంది.

శ్రీశైలం డ్యామ్​ చిత్రాలు

అలరిస్తున్న శ్రీశైలం జలాశయం
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలానికి జలాశయానికి వరద పోటెత్తుతోంది. అధికారులు 6 గేట్లను 10 అడుగులమేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్​ పూర్తి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం చేరుతున్న వరదనీటితో 884.40 అడుగులకు చేరుకుంది. పూర్తి నీటి నిల్వ 215 టీఎంసీలకు...211.95 టీఎంసీలకు నీరు చేరింది. 2.96 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లోలో..2.72 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.


ప్రకాశం బ్యారేజికీ పెరిగిన వరద ఉద్ధృతి
ప్రకాశం బ్యారేజికీ వరద ఉద్ధృతి పెరిగింది. 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రతి గేటునూ..5 అడుగుల మేర ఎత్తి నీరు వదులుతున్నారు.

Last Updated : Oct 4, 2019, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details