ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 19, 2020, 7:52 AM IST

ETV Bharat / state

నీటి సంపులో పడి చిన్నారి మృతి

నీటి సంపులో పడి ఓ చిన్నారి మృతిచెందింది. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

due to jumped in water tank unknowingly a small child was died
due to jumped in water tank unknowingly a small child was died

కర్నూలు జిల్లా ఆలూరు మండలం హతి బెళగల్ గ్రామంలో నీటి సంపులో పడి ఓ చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన పరిషత్ , రాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు. వీరిలో రెండవ కుమార్తె పరిమళ ఇంటి దగ్గర ఆడుకుంటుండగా పొరపాటున నీటి సంపులో పడింది.చిన్నారి పరిమళ ఎంతసేపటికి కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి బయటకు వచ్చి చూడగా కూతురు అప్పటికే చనిపోయి కనిపించింది. ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

ABOUT THE AUTHOR

...view details