కర్నూలులో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నందున... ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. నగరంలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ వాహనాలతో గస్తీ తిరుగుతూ.. ప్రజలను అప్రమత్తం చేశారు. రెడ్ జోన్ పరిధిలోని ఇళ్లకు నిత్యావసర సరుకులు డోర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.
లాక్డౌన్ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలే! - కర్నూలులో కరోనా వార్తలు
కర్నూలు నగరంలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ వాహనాలతో పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
due to corona lockdown Police patrols with patrol vehicles in red zone areas at kurnool