ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డిపాజిట్‌ చెల్లించలేదని.. కుళాయికి బిరడా కొట్టేశారు - AP News

వేసవి కాలంలో తాగునీటి సమస్యలను పరిష్కరించలేక... ఉన్న కుళాయి కనెక్షన్లకు తొలగించేస్తుంది వైకాపా ప్రభుత్వం. కుళాయి కనెక్షన్లకు డిపాజిట్‌ కట్టలేదనే సాకుతో.. కనెక్షన్లు తొలగించి గొట్టాలకు బిరడాలు బిగిస్తున్నారు. గతంలో కుళాయిల ఏర్పాటుకు రూ.3 వేలు చెల్లించామని, ఇప్పుడు అనధికార కనెక్షన్ల పేరుతో తొలగిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.

Drinking water issue in kurnool district
Drinking water issue in kurnool district

By

Published : Mar 21, 2022, 5:22 AM IST

Updated : Mar 21, 2022, 6:25 AM IST

కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీలో కుళాయి కనెక్షన్లకు డిపాజిట్‌కట్టలేదని.. కనెక్షన్లు తొలగించి గొట్టాలకు బిరడాలు బిగిస్తున్నారు. ఆ ఇళ్లలోని వారు వీధి కుళాయిలనూ వాడుకోకుండా వాటికీ బిరడాలు వేస్తున్న వైనం విమర్శలకు తావిస్తోంది. కాలనీల్లో గతంలో కుళాయిల ఏర్పాటుకు రూ.3 వేలు చెల్లించామని, ఇప్పుడు అనధికార కనెక్షన్ల పేరుతో తొలగిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.

దీనిపై నగర పంచాయతీ కమిషనరు శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి రూ.20 లక్షల బకాయిలున్నాయన్నారు. అనధికార కనెక్షన్లు చాలా ఉన్నాయని, వాటిని చెక్క బిరడాలతో మూసేస్తున్నామని వెల్లడించారు. ఒక్కో దానికి రూ.6400 డిపాజిట్‌ చెల్లిస్తే వాటిని పునరుద్ధరిస్తామన్నారు.

ఇదీ చదవండి:గొంతెండుతోంది.. మంచి నీళ్లు మహాప్రభో..

Last Updated : Mar 21, 2022, 6:25 AM IST

ABOUT THE AUTHOR

...view details