తానా ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ - distribution essential things news
తానా, మానవతా స్వచ్ఛంద సేవ సమితి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడారు.
![తానా ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ Distribution of essentials to the poor people](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7418917-75-7418917-1590920060837.jpg)
తానా ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ
కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని తానా సభ్యులు కర్నూలులో కొనియాడారు. తానా, మానవతా స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో 90 మందికి నిత్యావసర సరకులు కిట్లు అందించారు. ఈకార్యక్రమంలో డీఎస్పీ మహబూబ్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు నిత్యావసరాలు అందజేశారు. తానా ఆధ్వర్యంలో ప్రతిరోజ మున్సిపల్ కార్మికులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నామని సంస్థ నిర్వాహకులు తెలిపారు.