ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలి'

కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తూ నంద్యాలలోని గాంధీ చౌక్ వద్ద రాయలసీమ సాగునీటి సమితి సభ్యులు ధర్నా నిర్వహించారు. బోర్డును విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలనుకోవడం అనాలోచిత నిర్ణయమని పేర్కొన్నారు.

By

Published : Jan 9, 2021, 10:42 PM IST

dharna to set up krishna river ownership board in kurnool district
కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్​

కర్నూలు జిల్లా నంద్యాలలోని గాంధీ చౌక్ వద్ద రాయలసీమ సాగునీటి సమితి సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి.. తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కృష్ణానదికి ఏ మాత్రం సంబంధం లేని విశాఖలో బోర్డును ఏర్పాటు చేయాలని.. ప్రభుత్వం భావించడం అనాలోచిత నిర్ణయమని రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. ఈ నిర్ణయాన్ని అన్ని ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

ఆలయాలపై నిఘా పెంచాలి: ఎస్పీ ఫక్కీరప్ప

ABOUT THE AUTHOR

...view details