కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన కాలేషా అనే 20 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసినట్లు.. రెండో పోలీస్స్టేషన్ సీఐ కంబగిరి రాముడు పేర్కొన్నారు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఇంట్లోకి ఎత్తుకెళ్లి ఈ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వైద్య పరీక్షల్లో బాలికపై అత్యాచారం జరిగినట్లు వెల్లడైంది. ఫోక్సో, అత్యాచారం కేసులు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు.
కేసు ఆలస్యంపై ఎస్పీ సీరియస్!