దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని కర్నూలు జిల్లా ఆదోనిలో సీపీఎం నేతలు రాస్తారోకో చేశారు. పట్టణానికి వచ్చే, గ్రామాలకు వెళ్లే రహదారులు అధ్వాన్నంగా తయారై.. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కొత్త రోడ్లు వేయకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని .. ఆ పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
రోడ్లకు మరమ్మతులు చేయాలంటూ సీపీఎం నిరసన - రోడ్ల మరమ్మతుకు ఆదోని సీపీఎం ఆందోళనలు
అధ్వాన్నంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఎం నేతలు ఆరోపించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో రాస్తారోకో నిర్వహించారు. కొత్త రహదారులు వేయకుంటే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
![రోడ్లకు మరమ్మతులు చేయాలంటూ సీపీఎం నిరసన cpm protest for roads repair](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9569045-744-9569045-1605605096599.jpg)
రాస్తారోకో నిర్వహిస్తున్న సీపీఎం నేతలు