ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 10, 2022, 10:07 AM IST

ETV Bharat / state

"ప్రజల్లో తలెత్తుకోలేకపోతున్నాం.." కర్నూలు కార్పొరేటర్ల ఆవేదన

CORPORATORS FIRES ON MAYOR: వార్డుల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకపోవడంతో ప్రజల ముందు తలెత్తుకోలేకున్నామని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.నిధులు ఎందుకు మంజూరు చేయడం లేదంటూ మేయర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

CORPORATORS FIRES ON MAYOR
CORPORATORS FIRES ON MAYOR

CORPORATORS FIRES ON MAYOR : వార్డుల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించటం లేదని కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సమావేశంలో కేటాయించిన నిధులను సైతం ఎందుకు విడుదల చేయటం లేదంటూ కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మేయర్ బీవై రామయ్యను నిలదీశారు. నిధులు లేకపోవటంతో వార్డుల్లో అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

"అభివృద్ధి పనులు చేయలేక.. ప్రజల్లో తలెత్తుకోలేకపోతున్నాం".. కార్పొరేటర్ల ఆవేదన

ABOUT THE AUTHOR

...view details