కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. తాజాగా 8కేసులు నమోదవ్వగా.. జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 60,295కు చేరింది. ఇప్పటి వరకు 59,699 మంది మహమ్మారిని జయించగా.. ఇంకా 109మంది వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో వైరస్ కారణంగా ఇవాళ ఒక్కరు కూడా చనిపోలేదు. కాగా ఇప్పటి వరకు కరోనా ధాటికి మొత్తం 487మంది మృతిచెందారని వైద్యాధికారులు వెల్లడించారు.
కర్నూలులో తగ్గిన కరోనా.. తాజాగా 8కేసులు నమోదు - కర్నూలు కరోనా బులెటిన్
కర్నూలులో కరోనా ప్రభావం తగ్గింది. కొత్తగా 8మంది వైరస్ బారిన పడ్డారు. ఇంకా 109మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వైద్యాధికారులు తెలిపారు.

తాజాగా కేసులు నమోదు