ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కర్నూలులో 11 నెలల చిన్నారికి కరోనా

By

Published : Apr 28, 2020, 7:04 PM IST

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కర్నూలులో కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 11 నెలల చిన్నారికి వైరస్​ పాజిటివ్​గా తేలడం కలకలం రేపింది. అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

Corona positive for 11 month old child at Joharapuram in kurnool
Corona positive for 11 month old child at Joharapuram in kurnool

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం జొహారాపురం గ్రామంలో 11 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి దిల్లీ మర్కజ్​ వెళ్లి రావటంతో వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. క్వారంటైన్‌ పూర్తైన అనంతరం వారిని పరీక్షించగా నెగిటివ్‌ రావడం వల్ల ఇటీవలే వారు ఇంటికి తిరిగి వచ్చారు. మరోసారి వారికి వైద్య పరీక్షలు చేయగా.. ఆ కుటుంబంలో చిన్నారికి పాజిటివ్‌గా తేలింది. విషయం తెలుసుకున్న ఆదోని డీఎస్పీ రామకృష్ణ, ఆలూరు సీఐ భాస్కర్‌ గ్రామాన్ని సందర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

ABOUT THE AUTHOR

...view details