ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు జిల్లాలో మరో 11 పాజిటివ్ కేసులు - కర్నూలు జిల్లాలో కరోనా కేసులు

కర్నూలు జిల్లాలో ఇవాళ మరో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకీ జిల్లాలో కేసులు పెరుగుతుండడంపై ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 343 కేసులు నమోదు కాగా.. 9 మంది మరణించారు.

corona case in kurnool district
corona case in kurnool district

By

Published : Apr 29, 2020, 2:31 PM IST

కర్నూలు జిల్లాలో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఏకంగా 40 పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఇవాళ మరో 11 మందికి కరోనా సోకినట్టు తేలిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

వీటితో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 343 కు పెరిగింది. ఈ వైరస్ సోకి ఇప్పటి వరకు 9 మంది మృత్యువాత పడ్డారు. 43 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన 291 మంది కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details