ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మినెంట్ చేయాలి' - కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మనెంట్ చేయాలి

ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరను పర్మనెంట్ చేయాలని... కర్నూలు జిల్లాలో వారు ఆందోళన చేపట్టారు. 2020_21 విద్యా సంవత్సరానికి పది నెలలకే రెన్యువల్ విడుదల చేశారని... దీనిపై సీఎం జగన్ స్పందించాలని కోరారు.

Contract lecturers darna in kurnool that they should be made permanent
కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మనెంట్ చేయాలి

By

Published : Aug 17, 2020, 6:17 PM IST

ప్రభుత్వ విద్యావ్యవస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కర్నూలులో నిరసన తెలిపారు. గత సంవత్సరం లాగానే 12 నెలలకు రెన్యూవల్ ఉత్తర్వులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. 2020_21 విద్యా సంవత్సరానికి పది నెలలకే రెన్యూవల్ విడుదల చేశారని... ఈ విషయం పై విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు.

సీఎం జగన్ స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. నాలుగు నెలల నుంచి వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని... పాదయాత్ర లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details