ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కర్నూలు జిల్లా కలెక్టర్ నిర్ణయం సరికాదు: భూమా అఖిలప్రియ

By

Published : Aug 19, 2020, 8:50 PM IST

హోం ఐసోలేషన్​లో ఉన్నవారిని ఆసుపత్రులకు తరలిస్తామంటూ కర్నూలు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ చేసిన ప్రకటనను మాజీ మంత్రి, తెదేపా నాయకురాలు భూమా అఖిల ప్రియ తప్పుబట్టారు. కరోనా కాలంలో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు.

akhila priya
akhila priya

హోమ్ ఐసోలేషన్​లో ఉన్న వారందరినీ ఆసుపత్రికి తరలిస్తామని కర్నూలు జిల్లా కలెక్టర్ ప్రకటన చేయడం సరికాదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేకుండా ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆమె నిలదీశారు.

ప్రజల్ని ఇబ్బంది పెట్టే నిర్ణయాలు అధికారులు తీసుకోవటం తగదని భూమా అఖిల ప్రియ అన్నారు. అధికారులు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంటే అధికార పార్టీ నేతలు మౌనం వహించడం తగదని చెెప్పారు.

ABOUT THE AUTHOR

...view details