ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు కర్నూలు జిల్లాకు ముఖ్యమంత్రి జగన్ - కర్నూలు జిల్లా తాజా వార్తలు

ముఖ్యమంత్రి జగన్ నేడు కర్నూలు జిల్లాకు రానున్నారు. ఇటీవల కన్నుమూసిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శిస్తారు. సీఎం పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

cm jagan
cm jagan

By

Published : Jan 5, 2021, 10:58 PM IST

Updated : Jan 6, 2021, 3:01 AM IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం కర్నూలు జిల్లా అవుకులో పర్యటించనున్నారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. హెలికాఫ్టర్​లో ఇవాళ మధ్యాహ్నం అవుకు చేరుకోనున్న సీఎం... అనంతరం రోడ్డు మార్గం ద్వారా చల్లా రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుని... అక్కడి నుంచి అమరావతికి వెళ్తారు. సీఎం పర్యటన దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.

Last Updated : Jan 6, 2021, 3:01 AM IST

ABOUT THE AUTHOR

...view details