ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నష్ట పరిహారం వివాదం..రెండు గ్రామాల మధ్య గొడవ - కర్నూలు జిల్లా వార్తలు

కర్నూలు జిల్లాలోని అవుకు మండలంలోని రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఒక యాక్సిడెంట్​ నష్ట పరిహారం వివాదం పెద్ద గొడవకు దారి తీసింది. ఈ ఘర్షణలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

clash between two villages
నష్ట పరిహారం వివాదంలో రెండు గ్రామాల వ్యక్తుల మధ్య గొడవ

By

Published : Apr 10, 2021, 10:50 PM IST

కర్నూలు జిల్లా అవుకు మండలం చిన్నంపల్లిలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. మూడు రోజుల కిందట ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ద్విచక్ర వాహనాలకు నష్టపరిహారం విషయంలో జరిగిన ఘర్షణలో చిన్నంపల్లికి చెందిన బోయ మద్దిలేటి, బోయ మధులపై పక్కనున్న శివవరం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కత్తులు, కర్రలతో దాడి చేశారు.

తీవ్రగాయాలైన మద్దిలేటి, మధులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులకు తీవ్రగాయాలు కావడంతో చిన్నంపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై అవుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘర్షణలు జరగకుండా పోలీసులు ముందస్తుగా గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details