ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో చెక్‌పోస్ట్ వద్ద రూ.90 లక్షలు పట్టివేత

కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఎస్​ఈబీ అధికారులు రూ.90లక్షలు భారీ నగదును పట్టుకున్నారు. ప్రైవేట్‌ బస్సులో డబ్బును తరలిస్తుండగా అధికారులు గుర్తించారు.

By

Published : Aug 1, 2021, 10:18 AM IST

cash seize
cash seize

కర్నూలులోని రాష్ట్ర సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద ఎస్​ఈబీ అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో 90 లక్షల నగదును బ్యాగుల్లో గుర్తించారు. కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు వీటిని తీసుకెళ్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. సొమ్మును స్వాధీనం చేసుకొని తాలూకా పోలీస్ స్టేషన్ కు అప్పగించామని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details