ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిబంధనలు ఉల్లంఘిస్తే..ప్రజాప్రతినిధులైనా డోంట్​ కేర్​! - @corona ap cases

లాక్​డౌన్​ నిబంధనలను ఉల్లంఘించారని కర్నూలు జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే వెంకటస్వామి,వైకాపా సమన్వయకర్త బైరెడ్డి సిద్ధారెడ్డిపై స్థానిక పోలీస్​స్టేషన్లో కేసు నమోదు చేశారు.భౌతికదూరం పాటించకపోవడం వల్లే కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు.

case filed on ycp leaders due to not maintaining the social distance in public place  at kurnool dst
నిబంధనలు ఉల్లంఘిస్తే..ప్రజాప్రతినిధులైనా డోంట్​ కేర్​!

By

Published : Apr 14, 2020, 6:18 PM IST

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామిపై నందికొట్కూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. లాక్​డౌన్​ నిబంధనలను ఉల్లంఘించారని వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజ రావు తెలిపారు. హైపో ద్రావకం పంపిణీ చేసిన వీరిద్దరూ... భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా ఉండడంతో వీరిపై,వీరితో పాటు తిరిగిన అనుచరులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details