ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అతివేగంతోనే "వెల్దుర్తి" ప్రమాదం... బస్ డ్రైవర్ అరెస్ట్

వెల్దుర్తి రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు. 17 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన బస్ డ్రైవర్​ను అరెస్ట్ చేశారు.

By

Published : May 18, 2019, 9:44 AM IST

వెల్దుర్తి ప్రమాదానికి కారణమైన బస్ డ్రైవర్ అరెస్ట్

కర్నూలు జిల్లా వెల్దుర్తి జాతీయ రహదారిపై జరగిన ప్రమాదానికి కారణమైన ఎస్.ఆర్.ఎస్ ట్రావెల్స్ బస్ డ్రైవర్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని మంగళూరుకి చెందిన జోసెఫ్​గా గుర్తించామని డీఎస్పీ ఖాదర్ భాషా తెలిపారు. ఈనెల 11న జరిగిన ఈ ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. అతివేగం, ప్రమాద సమయంలో బ్రేకులు పనిచేయకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. అతడిని కోర్టులో హాజరు పరుస్తామని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details