కర్నూలు జిల్లా ఆదోని బార్పేటలో ఉంటున్న వివాహిత భానును... కుటుంబ కలహాల నేపథ్యంలో సొంత మరిదే కత్తితో పొడిచి హత్య చేశాడు. భాను.. తన చెల్లికి ఖాసీం అనే వ్యక్తితో వివాహం చేసింది. వారిద్దరికీ సఖ్యత లేక ఎప్పడూ గొడవ పడుతుండేవారు. ఎప్పటిలాగే వారికి గొడవ జరుగుతున్న సమయంలో భాను అక్కడికి వెళ్లగా... ఖాసీం ఆగ్రహించాడు. వదిన అని కూడా చూడకుండా కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
వదినను హతమార్చిన మరిది - undefined
భర్తను భార్య నరికి చంపిన ఘటన మరువక ముందే.. రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. తన భార్య అక్కను.. హత్య చేసి పరారయ్యాడో దుర్మార్గుడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది.
సొంత వదినను హతమార్చిన మరిది