ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు కలెక్టరేట్ ఎదుట భాజపా ఆధ్వర్యంలో ధర్నా - kurnool latest updates

అన్ని అధారాలు ఉన్న భూములను సైతం అధికార పార్టీ నాయకులు దౌర్జన్యంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట భాజపా ఆధ్వర్యంలో పలువురు బాధితులు ధర్నా చేపట్టారు.

భాజపా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన బాధితులు
భాజపా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన బాధితులు

By

Published : Nov 24, 2020, 6:52 PM IST

అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తమ భూమిని దౌర్జన్యంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని భాజపా ఆధ్వర్యంలో బాధితులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. నంద్యాల సమీపంలోని ఐలూరు గ్రామంలో రజకులు, ముస్లింలకు చెందిన 60 సెంట్ల భూమిని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశామన్నారు. తమ భూమికి లాయర్ నోటీసులు పంపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details