కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో పుష్కర ఘాట్ల నిర్మాణాల్లో అవినీతిని జరిగిందని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పురుషోత్తంరెడ్డి ఆరోపించారు. పుష్కర ఘాట్ను పరిశీలించేందుకు ఇంజినీరుతో సహా వెళ్తున్న భాజపా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
మంత్రాలయం పుష్కర ఘాట్ల నిర్మాణాల్లో అవినీతి: భాజపా - కర్నూలు జిల్లా వార్తలు
కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో పుష్కర ఘాట్ల నిర్మాణాలను పరిశీలించేందుకు వెళ్తున్న భాజపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భాజపా నేతలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఘాట్ల నిర్మాణాల్లో అవినీతి జరిగిందని, ఆ అవినీతి బయటపడుతుందనే భాజపా నేతలను అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నేత పురుషోత్తంరెడ్డి ఆరోపించారు.
![మంత్రాలయం పుష్కర ఘాట్ల నిర్మాణాల్లో అవినీతి: భాజపా Bjp leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9635212-131-9635212-1606124269836.jpg)
Bjp leaders
పుష్కరఘాట్ల పరిశీలనకు వెళ్తున్న భాజపా నేతలను అడ్డుకున్న పోలీసులు
పోలీసుల చర్యతో భాజపా నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. పోలీసు రాజ్యంలో ఉన్నామా అని పురుషోత్తంరెడ్డి ప్రశ్నించారు. పుష్కర ఘాట్లను పరిశీలించేందుకు శాంతియుతంగా వెళ్తున్న తమను అడ్డుకోవడం సరికాదన్నారు. ఘాట్ నిర్మాణాల్లో జరిగిన అవినీతిని బయటపెట్టే వరకూ భాజపా పోరాటం చేస్తుందన్నారు.
ఇదీ చదవండి :పెద్దవడుగూరులో తెదేపా కార్యకర్తపై వైకాపా నాయకుల దాడి