ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

bjp somu: హిందువుల వేడుకలపైనే ఆంక్షలెందుకు..? - కర్నూలు తాజా వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పక్క రాష్ట్రంలో అనుమతి ఇచ్చిన విధంగా ఆంధ్రప్రదేశ్​లో అనుమతి ఇవ్వాలని కోరారు.

BJP leaders protest
భాజపా నాయకుల నిరసన

By

Published : Sep 5, 2021, 7:42 PM IST

Updated : Sep 5, 2021, 9:57 PM IST

బహిరంగ ప్రాంతాల్లో వినాయక చవితి వేడుకలు, సామూహిక నిమజ్జనాలు జరుపుకోవద్దంటూ ప్రభుత్వం ఆదేశించడం..దుర్మార్గమని భాజపా విమ‌ర్శించింది. కర్నూలులో నిర్వహించిన ఆ పార్టీ రాయలసీమ జిల్లాల ముఖ్యనాయకుల సమావేశంలో పార్టీ జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్‌, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇతర నేతలు పాల్గొన్నారు. అనంతరం నగరంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి.. రాజ్ విహార్ కూడలిలో నేతలు బైఠాయించి.. నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. వినాయక చవితి పండుగకు ప్రభుత్వం అనుమతిచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కేవలం హిందువుల వేడుకలపైనే ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పరిస్థితి ఉద్రిక్తత..

రహదారిపై బైఠాయించిన నేతలు.. ప్రభుత్వం అనుమతి ఇచ్చేవరకు ఆందోళన చేస్తామని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులు వాహనాలను అడ్డుకున్నారు. కలెక్టర్ నివాసం ముట్టడికి దూసుకెళ్లారు. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీ నేత విష్ణువర్ధన్‌రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్​కు తరలించారు.

హిందువుల వేడుకలపైనే ఆంక్షలెందుకు..?

ఇదీ చదవండీ.. murder: భర్తను హత్య చేసిన భార్య.. కారణం...

Last Updated : Sep 5, 2021, 9:57 PM IST

ABOUT THE AUTHOR

...view details