చైనా వస్తువులు కనిపిస్తే నాశనం చేయాలని భాజపా నాయకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి తెలిపారు. ఆ దేశం తయారు చేసిన వస్తువులను వాడనపుడే అమరవీరులకు నిజమైన నివాళి అర్పించిన వారిమవుతామని అయన అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రధాన మంత్రి ఏడాది పాలనలో జరిగిన అభివృద్దిని ఆయన వివరించారు. దేశ సరిహద్దుల్లో అమరులైన జవాన్లకు సంతాపం తెలిపారు.
'చైనా వస్తువులు కనిపిస్తే నాశనం చేయండి' - కర్నూలు జిల్లా లో భాజపా తాజా వార్తలు
చైనా దాడిలో వీరమరణం పొందిన అమరజవాన్లకు కర్నూలు జిల్లా నంద్యాలలో భాజపా నాయకులు ఘననివాళి అర్పించారు. చైనా వస్తువుల వాడకాన్ని పూర్తిగా బహిష్కరించిన రోజునే అమరవీరుల ఆత్మశాంతి కలుగుతుందని అభిప్రాయపడ్డారు. .
!['చైనా వస్తువులు కనిపిస్తే నాశనం చేయండి' bjp leader byreddy rajashekar reedy fired of china attack](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7670595-745-7670595-1592483539183.jpg)
bjp leader byreddy rajashekar reedy fired of china attack