ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైకోర్టు ఏర్పాటుపై అసెంబ్లీలో బిల్లు... రాయలసీమ వాసుల హర్షం - హైకోర్టు ఏర్పాటుపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినందుకు రాయలసీమ వాసుల హర్షం

కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు అయ్యేలా శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టినందుకు రాయలసీమ వైకాపా శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాను జ్యుడీషియల్ క్యాపిటల్ చేసినందుకు కర్నూలులో వైకాపా నాయకులు సంబరాలు చేసుకున్నారు.

Bill in the Assembly on the formation of the High Court in kurnool
హైకోర్టు ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయంపై రాయలసీమ వాసుల హర్షం

By

Published : Jan 21, 2020, 11:04 AM IST

కర్నూలులో

కర్నూలులో వైకాపా నాయకుల సంబరాలు

కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేసేలా అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టినందుకు...జిల్లాను జ్యుడీషియల్ క్యాపిటల్ చేసినందుకు కర్నూలులో వైకాపా నాయకులు సంబరాలు చేసుకున్నారు. నగరంలోని రాజ్ విహర్ కూడలిలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

అనంతపురంలో

అనంతపురంలో వైకాపా నాయకుల సంబరాలు

హైకోర్టు ఏర్పాటుపై అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అనంతపురంలో వైకాపా విద్యార్థి సంఘాల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. నగరంలోని టవర్ క్లాక్ వద్ద సీఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. వైకాపాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. మంత్రవర్గంలో తీసుకున్న నిర్ణయం అఖిలపక్ష పార్టీలకి బుద్ధి చెప్పే విధంగా ఉందని వైకాపా విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి అన్నారు.

ఇదీ చూడండి: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే...

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details