బోయిన్పల్లి కిడ్నాప్ ఉదంతంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిలుపై జైలు నుంచి విడుదలయ్యాక మొదటిసారిగా సోమవారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చేరుకున్నారు. ఆళ్లగడ్డ, నంద్యాల నుంచి పెద్ద ఎత్తున తెదేపా నాయకులు, అభిమానులు ఆమెకు స్వాగతం పలికారు. వారితో కలిసి ఆళ్లగడ్డకు చేరుకున్న అఖిలప్రియ... నేరుగా ఆమె తల్లిదండ్రుల సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించారు.
ఆళ్లగడ్డకు అఖిలప్రియ...భారీగా తరలివచ్చిన కార్యకర్తలు - కర్నూలు జిల్లా తాజా వార్తలు
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హైదరాబాద్ నుంచి సోమవారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చేరుకున్నారు. ఆమెకు తెదేపా కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు.
![ఆళ్లగడ్డకు అఖిలప్రియ...భారీగా తరలివచ్చిన కార్యకర్తలు AHHILA PRIYA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10375817-864-10375817-1611580822565.jpg)
AHHILA PRIYA