ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆళ్లగడ్డకు అఖిలప్రియ...భారీగా తరలివచ్చిన కార్యకర్తలు

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హైదరాబాద్​ నుంచి సోమవారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చేరుకున్నారు. ఆమెకు తెదేపా కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు.

By

Published : Jan 25, 2021, 7:47 PM IST

AHHILA PRIYA
AHHILA PRIYA

బోయిన్​పల్లి కిడ్నాప్ ఉదంతంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిలుపై జైలు నుంచి విడుదలయ్యాక మొదటిసారిగా సోమవారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చేరుకున్నారు. ఆళ్లగడ్డ, నంద్యాల నుంచి పెద్ద ఎత్తున తెదేపా నాయకులు, అభిమానులు ఆమెకు స్వాగతం పలికారు. వారితో కలిసి ఆళ్లగడ్డకు చేరుకున్న అఖిలప్రియ... నేరుగా ఆమె తల్లిదండ్రుల సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించారు.

ABOUT THE AUTHOR

...view details