పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం వల్ల.. ఆటోఛార్జీలకూ రెక్కలొచ్చాయి. సామాన్యులపై పెనుభారం పడుతోంది. నిత్యవసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకటంతో..మధ్యతరగతి కుటుంబాలకు బతుకే భారమైపోయింది.
కర్నూలులో సుమారు 25 వేల ఆటోలు ఉన్నాయి. ప్రస్తుతం సిటీ బస్సులు లేక.. వేల మంది పేద, మధ్య తరగతి, కూలీలు, విద్యార్థులు.. ఆటోలనే ఆశ్రయించాల్సి వస్తోంది. గతంలో లింక్ ఆటోల్లో 15 రూపాయలు వసూలు చేసేవారు. పెట్రో, డీజిల్ రేట్లు..సెంచరీకి చేరటంతో ఆటో యూనియన్లు ఛార్జీలను పెంచేశాయి.