ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామస్థుల ఫిర్యాదు.. ప్రార్థన మందిరం ప్రహరీ కూల్చివేత - కర్నూలు జిల్లా తాజా వార్తలు

కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాలలో ప్రార్థన మందిరానికి ప్రహరీని అక్రమంగా నిర్మించారని గ్రామస్థులు.. అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు పోలీసు బందోబస్తు మధ్య ప్రొక్లెయిన్​తో ఆ గోడను కూల్చివేశారు.

గ్రామస్థుల ఫిర్యాదుతో ప్రార్థన మందిరం ప్రహారి కూల్చివేత
గ్రామస్థుల ఫిర్యాదుతో ప్రార్థన మందిరం ప్రహారి కూల్చివేత

By

Published : Jul 5, 2021, 4:53 PM IST

కర్నూలు జిల్లా నందవరం మండలంలోని గురజాలలో ప్రార్థన మందిరం ప్రహరీని అక్రమంగా నిర్మించారని గ్రామస్తులు చేసిన ఫిర్యాదుపై అధికారులు స్పందించారు. అధికారులు పోలీసు బందోబస్తు మధ్య ప్రొక్లెయిన్​తో కూల్చి వేశారు.

ఏటా నిర్వహించే రామలింగేశ్వరస్వామి ఆలయ రథోత్సవానికి అడ్డుగా గోడను నిర్మించారన్న ఫిర్యాదును నిర్ధరణ చేసుకున్న అధికారులు.. కూల్చేయించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత తలెత్తకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details