ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా మహిళా కార్యకర్తపై దాడి...పోలీసులకు నేతల ఫిర్యాదు - వైకాపా కార్యకర్తపై దాడి ఘటన

కర్నూలు నగరంలో వైకాపా మహిళా కార్యకర్తపై దాడి చేసిన దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు డీఎస్పీని కోరారు.

వైకాపా మహిళా కార్యకర్తపై దాడి
వైకాపా మహిళా కార్యకర్తపై దాడి

By

Published : Dec 5, 2020, 9:19 PM IST

వైకాపా కార్యకర్తపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కర్నూలులో ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం కర్నూలు నగరానికి చెందిన జమిలాబేగంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన దుండగులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని నగర డీఎస్పీని కోరారు.

తమపై దాడి జరిగినా స్థానిక ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్ పట్టించుకోవడం లేదని బాధితురాలు వాపోయింది. అధిష్టానం వద్దకు వెళ్లి వచ్చిన తర్వాతే తమపై దాడి జరిగిందని తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details