ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెదేపా నాయకుడిపై కత్తితో దాడి.. పంచాయతీ ఎన్నికల పగే కారణమా!

కడప జిల్లా చాగలమర్రి మండలం చిన్నబోధానంలో తెదేపా నాయకుడిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. పంచాయతీ ఎన్నికల్లో నెలకొన్న వైరాన్ని మనసులో పెట్టుకుని ఈ దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

By

Published : Mar 16, 2021, 4:34 PM IST

Published : Mar 16, 2021, 4:34 PM IST

attack on tdp leader with knife
తెదేపా నాయకుడిపై కత్తితో దాడి

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చిన్నబోధనం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు రమణారెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఉదయం పొలం వద్దకు వెళుతుండగా.. ప్రత్యర్థులు వెనుకవైపు నుంచి కత్తితో దాడి చేశారు. పంచాయతీ ఎన్నికల్లో.. రమణారెడ్డి తల్లి సర్పంచ్​గా పోటీ చేసి ఓడిపోయారు. నాటి నుంచి వైకాపా వర్గీయులకు.. రమణారెడ్డికి మధ్య వైరం పెరిగిందని స్థానికులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details