ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 28, 2020, 1:55 PM IST

ETV Bharat / state

పోలీసులపై దాడి కేసు.. పరారీలో మంత్రి బంధువు నారాయణ

కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరులో పోలీసులపై దాడి కేసులో మంత్రి జయరాం బంధువు నారాయణ పరారీలో ఉన్నారు. మంత్రి జయరాం బంధువు నారాయణ సహా 35 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిలో పట్టుబడిన 32 మందిని విచారిస్తున్నారు.

attack-on-police-issue-in-gummanuru-kurnool-district
పోలీసులపై దాడి కేసులో పరారీలో మంత్రి బంధువు నారాయణ

కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరులో పోలీసులపై దాడి కేసులో మంత్రి బంధువు నారాయణ పరారీలో ఉన్నారు. గుమ్మనూరులో పేకాడుతూ గురువారం పట్టుబడిన 32 మందిని పోలీసులు విచారిస్తున్నారు. ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో.. చిప్పగిరి పోలీస్ స్టేషన్​లో విచారణ జరుగుతోంది.

మంత్రి జయరాం బంధువు నారాయణ సహా 35 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నారాయణ చిప్పగిరి మండలం వైకాపా కన్వీనర్​గా ఉన్నారు. అలాగే వైకాపా నాయకులు శ్రీధర్, అజయ్​లు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. ఆ ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details