కర్నూలు జిల్లా చిప్పగిరిలో మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణ అనుచరులు...గొర్రెల కాపరులపై దాడికి పాల్పడ్డారు. వాహనాలకు గొర్రెలు అడ్డురావడంతో ఈ చర్యకు పాల్పడ్డారు. తిరుగు ప్రయాణంలో ఎందుకు దాడి చేశారని ప్రశ్నించిన వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని నిరసిస్తూ చిప్పగిరిలో అంబేడ్కర్ విగ్రహం ముందు గొర్రె కాపరులు ఆందోళనకు దిగారు. మంత్రి సోదరుడు నారాయణపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారి ఆందోళనతో గుంతకల్లు-ఆలూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
గొర్రెల కాపరులపై మంత్రి సోదరుని అనుచరుల దాడి - కర్నూలు జిల్లా నేర వార్తలు
కర్నూలు జిల్లా చిప్పగిరిలో గొర్రెల కాపరులపై మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు... నారాయణ అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని నిరసిస్తూ గొర్రెల కాపరులు ఆందోళనకు దిగారు. మంత్రి సోదరునిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఆందోళన చేస్తున్న గొర్రెల కాపరులు
గతంలోనూ పేకాట ఆడిస్తుండగా అడ్డుకున్న పోలీసులపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
ఇదీ చదవండి: కర్నూలులో 782 జిలిటెన్ స్టిక్స్, 800 డిటోనేటర్లు స్వాధీనం
Last Updated : Mar 27, 2021, 7:21 PM IST