కర్నూలు జిల్లా నంద్యాలలో లాక్డౌన్ కొనసాగుతోంది. రెడ్ జోన్ ప్రాంతాల్లో లాక్డౌన్ మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేశారు. కాలనీలు, వీధుల్లో రసాయనాలను పిచికారి చేస్తున్నారు. జన్ధన్ ఖాతాదారుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 500 జమ కావటంతో మహిళలు బ్యాంకుల వద్ద బారులు తీరారు. భౌతిక దూరం పాటించాలని పోలీసులు వారికి సూచించారు.
నంద్యాలలో పకడ్భందీగా లాక్డౌన్ అమలు - నంద్యాలలో పకడ్భందీగా లాక్డౌన్ అమలు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కర్నూలు జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతోంది. నంద్యాలలో రెడ్ జోన్గా ప్రకటించిన ప్రాంతాల్లో అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేశారు.

పకడ్భందీగా లాక్డౌన్ అమలు