ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అహోబిలంలో కన్నుల పండువగా శ్రీరామ నవమి - latest sriramanavani in kurnool district

ప్రతి ఏటా శ్రీరామనవమి వచ్చిందంటే ఆలయ ప్రాంతాలన్నీ వేలాదిమంది భక్తులతో కిటకిటలాడేవి. అయితే ఈ ఏడాది మాత్రం కరోనా వైరస్ కారణంగా ఆలయ ప్రాంగణాలన్నీ బోసిపోయాయి. అహోబిలం క్షేత్రంలో శ్రీరామ నవమి ఉత్సవాన్ని పరిమిత భక్తుల నడుమ నిర్వహించారు.

ahobilam sriramanavami
అహోబిలంలో కన్నుల పండువగా శ్రీరామ నవమి

By

Published : Apr 3, 2020, 11:28 AM IST

అహోబిలంలో కన్నుల పండువగా శ్రీరామ నవమి

కర్నూలు జిల్లాలో.. లక్ష్మీ నరసింహ స్వామి వెలసిన అహోబిల క్షేత్రంలో శ్రీరామ నవమి వేడుకలు నిరాడంబంరంగా జరిగాయి. సీతారామ, లక్ష్మణ ఉత్సవ మూర్తులకు నవ కలశ పంచామృతాభిషేకం నిర్వహించారు. వేదమంత్రాల నడుమ స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించి మంగళ హారతులు ఇచ్చారు. కరోనా నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పరిమితంగా భక్తుల నడుమ ఈ ఉత్సవాలను పూర్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details