ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 13, 2020, 3:46 PM IST

ETV Bharat / state

పంట నష్టపోయిన రైతులకు త్వరలో పరిహారం: వ్యవసాయ కమిషనర్

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు త్వరలో పరిహారం అందజేస్తామని వ్యవసాయ కమిషనర్ అరుణ్ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా హెచ్.కైరవాడిలో పర్యటించిన ఆయన రైతులతో ముచ్చటించారు.

పంట నష్టపోయిన రైతులకు త్వరలో పరిహారం
పంట నష్టపోయిన రైతులకు త్వరలో పరిహారం

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని హెచ్.కైరవాడిలో వ్యవసాయ కమిషనర్ అరుణ్ కుమార్ పర్యటించారు. రైతులతో మాట్లాడిన ఆయన...భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు త్వరలో పరిహారం అందజేస్తామన్నారు. రైతులు సంఘాలుగా ఏర్పడితే రాయితీపై ట్రాక్టర్ వంటి వ్యవసాయ ఉపకరణాలు పొందవచ్చని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details