వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లులను వెంటనే రద్దు చేయాలని కర్నూలు సుందరయ్య సర్కిల్లో వ్యవసాయ, కార్మిక సంఘాలు ఆందోళన నిర్వహించాయి. కేంద్ర వైఖరికి నిరసనగా ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. రైతులకు నష్టం కలిగించే చట్టాలను వెనక్కి తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. కేంద్రం, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
'రైతులకు నష్టం చేకూర్చే చట్టాలను రద్దు చేయాలి' - కర్నూలు జిల్లా వార్తలు
కర్నూలు జిల్లా సుందరయ్య సర్కిల్లో వ్యవసాయ, కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. నల్ల చట్టాలతో పాటు విద్యుత్తు బిల్లులను వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరాయి. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశాయి.
!['రైతులకు నష్టం చేకూర్చే చట్టాలను రద్దు చేయాలి' labor unions agitation at sundaraiah circle kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10069814-309-10069814-1609409860948.jpg)
చట్టాలను రద్దు చేయాలి