ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గెటప్​ మార్చిన ఆదోని ఆర్డీవో.. ఎందుకంటే! - #corona virus in andhrapradesh

పోలీసులు సాధారణ వ్యక్తిలా స్టేషన్లోకి ఎంటరై సహోద్యోగులకు షాక్​ ఇచ్చిన ఘటనలను సినిమాల్లో చూస్తుంటాం. అంతేరీతిలో ఆర్డీవో బాలగణేశయ్య... సాధారణ వ్యక్తిలా కర్నూలు జిల్లా ఆదోని రైతుమార్క్​ట్​కు వెళ్లి కూరగాయల ధరలు పరిశీలించారు. ధరల్లో తేడా ఉందేమోనన్న అనుమానంతో ఇలా చేసినట్లు తెలిపారు.

adhoni RDO change his getup and went to vegitable market
adhoni RDO change his getup and went to vegitable market

By

Published : Apr 3, 2020, 2:42 PM IST

ఆదోని కూరగాయల మార్క్​ట్​ను తనిఖీ చేసిన ఆదోని ఆర్డీవో

కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్​డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్డీవో బాలగణేశయ్య సాధారణ వ్యక్తిగా వెళ్లి కూరగాయలు తీసుకున్నారు. పట్టణంలోని పురపాలక మైదానంలో ఏర్పాటు చేసిన మార్కెట్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలు అమలు చేస్తున్నారో లేదో తెలుసుకోవటానికి పంచె కట్టులో వచ్చి కూరగాయలు కొనుగోలు చేసినట్టు తెలిపారు. 2 దుకాణాల్లో మిరపకాయలు కిలోకు ఐదు రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని... అడిగితే జవారీ ధరలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారని అన్నారు. మిగతా ధరల్లో తేడా లేదని ఆర్డీఓ చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details