ముగిసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధనా సిబ్బంది రాష్ట్ర స్థాయి క్రీడలు - మహానంది వ్యవసాయ కళాశాలలో పోటీలు
కర్నూలు జిల్లా మహానంది వ్యవసాయ కళాశాలలో... ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధనా సిబ్బంది రాష్ట్ర స్థాయి క్రీడా, సాంస్కృతిక, సాహిత్య పోటీలు ముగిశాయి. క్రికెట్, రన్నింగ్, వాలీబాల్, బ్యాడ్మింటన్ తదితర పోటీల్లో పురుషులు, మహిళల విభాగంలో కృష్ణా జిల్లా జట్టు ఓవరాల్ ఛాంపియన్షిప్గా నిలిచింది. పలువురు శాస్త్రవేత్తలు, అధ్యాపకులు వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు విజేతలకు బహుమతులను అందజేశారు.
ముగిసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధనా సిబ్బంది రాష్ట్రస్థాయి క్రీడలు
By
Published : Jan 25, 2020, 10:02 AM IST
ముగిసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధనా సిబ్బంది రాష్ట్రస్థాయి క్రీడలు