ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బాయిలర్ కోళ్ల లారీకి ప్రమాదం... క్లీనర్ మృతి

By

Published : Jul 8, 2020, 9:51 AM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం 40వ జాతీయ రహదారిపై బాయిలర్ కోళ్ల లోడుతో వెళ్తున్న లారీకి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందింది.

accident to lorry at allagadda
బాయిలర్ కోళ్ల లారీకి ప్రమాదం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం 40వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి లారీలో బాయిలర్ కోళ్ల లోడుతో వస్తుండగా ఆళ్లగడ్డ పరిధిలోని కోట కందుకూరు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో శివ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు.

దాదాపు రూ.50 వేల విలువచేసే కోళ్లు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఘటన జరిగిన తర్వాత లారీ డ్రైవర్ పరారయ్యాడు. మృతదేహాన్ని ఆళ్లగడ్డ గ్రామీణ పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ వరప్రసాద్ తెలిపారు.

ఇదీ చదవండి: బ్యాగు మోత తగ్గించే బోధన

ABOUT THE AUTHOR

...view details